గుండ్రాజుకుప్పంలో విగ్రహాల చోరీ

ABN , First Publish Date - 2022-12-30T00:34:24+05:30 IST

మండల పరిధిలోని గుండ్రాజు కుప్పం గ్రామంలో పంచలోహ విగ్రహాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.

గుండ్రాజుకుప్పంలో విగ్రహాల చోరీ
చోరీకి గురైన ఆంజనేయస్వామి దేవాలయం

నగరి, డిసెంబరు 29 : మండల పరిధిలోని గుండ్రాజు కుప్పం గ్రామంలో పంచలోహ విగ్రహాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైల్వేట్రాక్‌ సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయస్వామి విగ్రహాలను దొంగ లించుకు వెళ్లినట్టు సర్పంచ్‌ బాలచంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన కాలం నాటి విగ్రహా లని, వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కోరారు. జన సంచారం లేని ప్రాంతం కావడంతో దుండగులు సుల భంగా తమ పని కానిచ్చేశారని, నిందితులను పట్టుకో వాలని కోరారు.

Updated Date - 2022-12-30T00:34:27+05:30 IST