1న రెండో దశ నాడు-నేడు పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2022-02-23T07:00:19+05:30 IST
నాడు- నేడు కింద ఎంపికైన పాఠశాలల్లో మార్చి ఒకటో తేదీ నుంచి రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి.
చిత్తూరు (సెంట్రల్), ఫిబ్రవరి 22: జిల్లాలో నాడు- నేడు కింద ఎంపికైన పాఠశాలల్లో మార్చి ఒకటో తేదీ నుంచి రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 269 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు మంజూరు చేసింది. ఈ అంశంపై డీఈవో శేఖర్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డిలు మంగళవారం ఎంఈవోలు, హెచ్ఎంలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈనెల 26వ తేదీలోపు పనుల అంచనా నివేదికలు ఇవ్వాలని, 27న కలెక్టర్ ఆమోదం తీసుకుని, మార్చి ఒకటో తేదీన పనులు చేపట్టాలని ఆదేశించారు.