జగనన్న విద్యాదీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2022-11-12T02:20:29+05:30 IST
జగనన్న విద్యాదీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి చెన్నయ్య కోరారు.
తిరుపతి(తిలక్రోడ్), నవంబరు 11: జగనన్న విద్యాదీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి చెన్నయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2021 -22 విద్యాసంవత్సరానికి గాను జగనన్న విద్యాదీవెన పథకానికి 4వ విడత నిధులు మంజూరుకు సీఎం జగన్ 22న షెడ్యుల్ ఖరారు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ సచివాల యాల ద్వారా బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అనర్హుల జాబితాలోని విద్యార్థులు వారి అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సచివాలయాల్లో సమర్పించాలని తెలియజేశారు. 17వ తేదీలోపు అభ్యంతరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు.