హైస్కూల్‌ స్థలం కబ్జా

ABN , First Publish Date - 2022-10-04T06:06:39+05:30 IST

దసరా శెలవులను అదనుగా చూసుకుని వందేళ్ల చరిత్ర కలిగిన పుత్తూరు ప్రభుత్వ బాలుర ఉన్నత కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారు.

హైస్కూల్‌ స్థలం కబ్జా

పుత్తూరు, అక్టోబరు 3 : దసరా శెలవులను అదనుగా చూసుకుని వందేళ్ల చరిత్ర కలిగిన పుత్తూరు ప్రభుత్వ బాలుర ఉన్నత కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. దాదాపు 80 లక్షల రూపాయల విలువ చేసే ఈ స్థలాన్ని సోమవారం ఎక్స్‌వేటర్‌ చదును చేస్తుండడం చూసి  స్థానికులు అవాక్కయ్యారు.గాలి చెంగమ్మ అనే దానశీలి దాదాపు 25 ఎకరాల మామిడితోట స్థలాన్ని స్కూలుకు వితరణ చేశారు. ఈ స్థలం పుత్తూరు పట్టణానికి దాదాపు కిలోమీటరు దూరంలో వుంది. అయితే మున్సిపాలిటీ పరిధిలోకి ఆ పాఠశాల చేరడంతో ఆ స్థలానికి విలువ పెరిగింది.హైస్కూలుకు చెందిన క్రీడామైదానం ఆగ్నేయ భాగంలో 6.50 సెంట్ల స్థలం అటువైపు స్థలంలోకి చొచ్చుకుని వుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఓ రియల్టర్‌ అటు వైపున్న స్థలాన్ని చదును చేసే ప్రక్రియలో భాగంగా పాఠశాల స్థలాన్ని కూడా కలిపేసుకుని చదును చేస్తున్నాడు.తన నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కబ్జాపర్వాన్ని మంత్రి రోజా అడ్డుకుని నాడు-నేడు పథకం కింద ప్రహరీ గోడను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-10-04T06:06:39+05:30 IST