11 మండలాల్లో వర్షం
ABN , First Publish Date - 2022-10-14T05:46:34+05:30 IST
జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 11 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 13: జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 11 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పుంగనూరులో 20.2మి.మీ, బైరెడ్డిపల్లె 11.6, గంగవరం 11.4, గుడుపల్లె 11.4, బంగారుపాళ్యం 6.4, పలమనేరు 6, సోమల 4.6, చౌడేపల్లె 4.2, వి.కోట 4.2, రామకుప్పం 3.4, పెద్దపంజాణిలో 2.4 మి.మీ వర్షపాతం నమోదైంది.