శ్రీవారి సేవలో జస్టిస్‌ మల్లికార్జున

ABN , First Publish Date - 2022-12-12T02:12:31+05:30 IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో జస్టిస్‌ మల్లికార్జున

తిరుమల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వాదం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. ఉడిపిలోని భండారకేరి పీఠాధిపతి విద్యేశతీర్థ శ్రీపాద స్వామి కూడా ఆదివారం ఉదయం నైవేద్య సమయంలో శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-12-12T02:12:32+05:30 IST