వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-10-04T05:35:50+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 3: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఏఈవో విద్యాసాగర్రెడ్డి ఆయనకు స్వాగతం పలికి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.