జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
ABN , First Publish Date - 2022-12-09T23:49:45+05:30 IST
జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 9: జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా, డీఆర్వో కన్వీనర్గా ఉంటారు. సభ్యులుగా యూడై రీజనల్ ఆఫీసు ప్రాజెక్టు మేనేజర్, డీఆర్డీఏ, డ్వామా, డీపీవో, వ్యవసాయ, విద్య, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, హౌసింగ్, మైనార్టీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ అధికారులు ఉంటారు. వీరితో పాటు ఎల్డీఎం, పుంగనూరు, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు, చిత్తూరు పోస్టల్ సూపరింటెండెంట్, ఈ-గవర్నెన్స్ జిల్లా కోఆర్డినేటర్ సభ్యులుగా ఈ కమిటీ మూడు నెలలకోసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశమై ఆధార్ సీడింగ్ తదితర అంశాలపై సమీక్షిస్తుంది.