డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి
ABN , First Publish Date - 2022-07-07T06:36:20+05:30 IST
సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో పూర్తయింది.
ఉమ్మడి జిల్లాలో 7921 మందికి కొత్త జీతాలు
ఉద్యోగులకు ఇంకా అందని వ్యక్తిగత ప్రొసీడింగ్స్
మిగతా 2398 సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన
చిత్తూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో 10,319 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 7921 మందిని రెగ్యులర్ చేస్తూ కలెక్టర్ హరినారాయణన్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా ఆయా జిల్లాల అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కానీ, ఉద్యోగులకు రెగ్యులర్ చేసినట్లు వ్యక్తిగతంగా ప్రొసీడింగ్స్ ఇంకా ఇవ్వలేదు. సర్వీసు రిజిస్టర్ను కూడా సిద్ధం చేయలేదు. అలాగే చిన్న చిన్న కారణాలతో రెగ్యులర్ కాని 2398 మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగం రెగ్యులర్ అయినవారు
పంచాయతీ కార్యదర్శి-గ్రేడ్ 5 462
డిజిటల్ అసిస్టెంట్ 663
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 873
అగ్రికల్చర్ అసిస్టెంట్ 283
హార్టికల్చర్ అసిస్టెంట్ 148
సెర్రికల్చర్ అసిస్టెంట్ 133
వెటర్నరీ అసిస్టెంట్ 259
ఫిషరీష్ అసిస్టెంట్ 11
ఇంజనీరింగ్ అసిస్టెంట్ 835
వీఆర్వో- గ్రేడ్ 2 275
సర్వేయర్- గ్రేడ్ 3 809
మహిళా పోలీసు 1086
ఏఎన్ఎం 1009
వార్డు అడ్మినిస్ర్టేటివ్ సెక్రటరీ 170
ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ 163
ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 224
వెల్ఫేర్, డెవల్పమెంట్ సెక్రటరీ 168
ఎమినిటీస్ సెక్రటరీ 198
శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 152
మొత్తం 7921