Suicide attempt: చిత్తూరులో వైసీపీ కార్పొరేటర్ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-08-02T16:27:53+05:30 IST
చిత్తూరులో వైసీపీ కార్పొరేటర్ ఇందు ఆత్మహత్యాయత్నం చేశారు.
చిత్తూరు (Chittoor): నగరంలో వైసీపీ కార్పొరేటర్ (YCP Corporator) ఇందు ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేశారు. చిత్తూరు న్యాయస్థానంలో ఆమె జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృత్తిపరమైన వేధింపులే కారణమని ఇందు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.