దుర్గాదేవిగా చెంగాళమ్మ

ABN , First Publish Date - 2022-10-04T06:03:25+05:30 IST

సూళ్లూరుపేటలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో చెంగాళమ్మ సోమవారం దుర్గాదేవి అలంకారంలో దర్శన మిచ్చారు.

దుర్గాదేవిగా చెంగాళమ్మ

సూళ్లూరుపేట, అక్టోబరు 3:సూళ్లూరుపేటలో  జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో చెంగాళమ్మ సోమవారం దుర్గాదేవి అలంకారంలో దర్శన మిచ్చారు. ఉదయం అమ్మణ్ణికి అభిషేకానంరతం విశేష పూజలు చేశారు.యాగశాల మండలపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి మహాచండీయాగాన్ని వైభవంగా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీమంత్‌ రెడ్డి, హారిక దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ ఛైర్మన్‌ బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాస రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. అలంకార ఉభయకర్తలుగా నెల్లూరుకు చెందిన సాయికుమార్‌ వ్యవహరించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.సోమవారం సాయినగర్‌, పరమేశ్వరినగర్‌, మహదేవయ్య నగర్‌, ఇందిరా నగర్‌, ఝాన్సీనగర్‌వాసులు అమ్మవారికి సారెను సమర్పించారు. సాయినగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద నుంచి భక్తులు సారెను మేళ తాళాలు, వీరజాటి తాళ్లతో నెత్తిన పెట్టుకొని జీఎన్టీ రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకున్నారు.రాజగోపురం వద్ద భక్తులకు ఆలయ సిబ్బంది సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.

Updated Date - 2022-10-04T06:03:25+05:30 IST