వెటర్నరీలో మళ్లీ చిరుత సంచారం

ABN , First Publish Date - 2022-08-17T07:03:41+05:30 IST

తిరుపతిలోని వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది.

వెటర్నరీలో మళ్లీ చిరుత సంచారం

తిరుపతి(విద్య),ఆగస్టు16: తిరుపతిలోని వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పరిపాలనా భవన సమీపంలోని నిరంతర పశువైద్యవిద్య సమాచార కేంద్ర భవనం వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.పందుల పరిశోధనాస్థానంలో మూడు పందిపిల్లలపై దాడి చేయడంతో అవి మృతి చెందాయి. దాదాపు మళ్లీ పదినెలల తర్వాత ఆదివారం రాత్రి వీసీ బంగ్లా, పరిపాలనా భవనం సమీపంలో చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. పరిపాలనా భవనం సమీపంలో రెండు కుక్కలను వేటాడుతూ పరిగెడుతున్న దృశ్యాలను చూసి వర్సిటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.అటవీశాక అధికారులకు సమాచారం అందించడంతో మంగళవారం డీఎ్‌ఫవో పవన్‌కుమార్‌,ఇతర అధికారులు వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ అరుణాచలం రవితో చర్చించారు. ఈ సందర్భంగా వెటర్నరీ సైన్స్‌ డీన్‌ డాక్టర్‌ కె.సర్జన్‌రావు మాట్లాడుతూ రాత్రి సమయంలో చిరుత సంచరిస్తోంది కాబట్టి వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటలవరకు బయటకు రావద్దని సర్క్యులర్‌ జారీ చేశారు.    

Updated Date - 2022-08-17T07:03:41+05:30 IST