Chandrababu visit: కుప్పంలో మూడో రోజు చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2022-08-26T16:39:01+05:30 IST

చంద్రబాబు (Chandrababu) పర్యటన కుప్పంలో శుక్రవారం మూడో రోజు కొనసాగనుంది.

Chandrababu visit: కుప్పంలో మూడో రోజు చంద్రబాబు పర్యటన

చిత్తూరు జిల్లా (Chittoor dist.): టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటన కుప్పంలో శుక్రవారం మూడో రోజు కొనసాగనుంది. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో బాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. మరోవైపు నిన్నటి ఘటనల నేపథ్యంలో కుప్పంలో భారీగా పోలీసులు మోహరించారు.


మరోవైపు చంద్రబాబుకు భద్రత పెంచారు. గతంలో సిఫ్ట్‌కు ఆరుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డులు (NSG) ఉండగా.. దాన్ని రెట్టింపు చేశారు. గతంలో డీఎస్పీ (DSP) ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డీఐజీ (DIG) ర్యాంకుకు పెంచింది. ఇటీవల జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో భద్రత పెంచారు. చంద్రబాబు భద్రతపై ఎన్ఎస్‌జీ ప్రత్యేక దృష్టి సారించారు.

Updated Date - 2022-08-26T16:39:01+05:30 IST