చిత్తూరులో ఆటోమెటిక్ ఎఫ్సీ కేంద్రం
ABN , First Publish Date - 2022-09-08T06:02:04+05:30 IST
వాహనాల ఆటోమెటిక్ ఎఫ్సీ కేంద్రాన్ని చిత్తూరులో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రాజాబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రాజాబాబు
చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 7: వాహనాల ఆటోమెటిక్ ఎఫ్సీ కేంద్రాన్ని చిత్తూరులో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరుకు వచ్చిన ఆయన డిప్యూటీ ట్రాన్స్పోర్టు కార్యాలయాన్ని పరిశీలించారు. ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తున్న డ్రైవింగ్ ట్రాక్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ లైసెన్స్ పొందేందుకు ట్రాక్తో పాటు ఎఫ్సీ కేంద్రాల విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చిత్తూరు ఆర్టీఓ కార్యాలయంలో ఆటోమెటిక్ ఫిట్నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రెవెన్యూలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందడం గర్వకారణమని ప్రశంసించారు. కమిషనర్ వెంట డీటీసీ బసిరెడ్డి, ఎంవీఐలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.