AP Panchayat Raj Chamber Protest: అలిపిరి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-11-29T09:15:06+05:30 IST

గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం పేరుతో తిరుపతిలో నిరసన కార్యక్రమానికి ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చింది.

AP Panchayat Raj Chamber Protest: అలిపిరి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

తిరుపతి: గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం పేరుతో తిరుపతిలో నిరసన కార్యక్రమానికి ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చింది. అలిపిరిలో శ్రీవారి పాదాల చెంత నుంచి ఉద్యమాన్ని ప్రారంభించి... తిరుమలకు నడిచే వెళ్లాలా నేతలు ప్రణాళికను రూపించారు. ఇప్పటికే కీలక నేతలు అలిపిరికి చేరుకున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు తిరుపతికి చెందిన రవినాయుడు, సింగంశెట్టి సుబ్బరాయుడు తదితర నేతలను హౌస్ అరెస్టులు చేశారు. అలిపిరి వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తం 12 డిమాండ్లు రాష్త్ర ప్రభుత్వం ఆమోదించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మి ముత్యాల రావు పాల్గొననున్నారు.

Updated Date - 2022-11-29T09:15:07+05:30 IST