రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-09-26T06:20:18+05:30 IST

పట్టణ పరిధిలోని ఏకాంబరకుప్పం, వేపగుంట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైలు కింద పడి మృతి చెందిన గుర్తు తెలియని మృతదేహం

నగరి, సెప్టెంబరు 25: పట్టణ పరిధిలోని ఏకాంబరకుప్పం, వేపగుంట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని, బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంటు, లైట్‌ పింక్‌ ప్లేన్‌ రంగు చొక్క ధరించి ఉన్నాడని రైల్వే ఎస్‌ఐ రవి తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9963126343కు ఫోన్‌ చేయాలని కోరారు.


Updated Date - 2022-09-26T06:20:18+05:30 IST