మాజీ సైనికులకు ఆగస్టు 15 పరేడ్లో అవకాశం
ABN , First Publish Date - 2022-07-18T06:00:51+05:30 IST
ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికులకు ఆగస్టు 15న విజయవాడలో జరిగే స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో కంటెంజెంట్లో వలంటీర్స్గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు సైనిక్ వెల్ఫేర్ అఽధికారి ఆర్.విజయశంకర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(కొర్లగుంట), జూలై 17: ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికులకు ఆగస్టు 15న విజయవాడలో జరిగే స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో కంటెంజెంట్లో వలంటీర్స్గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు సైనిక్ వెల్ఫేర్ అఽధికారి ఆర్.విజయశంకర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 29వ తేదీలోపు జిల్లా సైనిక్ సంక్షేమ కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 7382407242 నెంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు.