నాడు చీఫ్‌ విప్‌.. నేడు విప్‌..!

ABN , First Publish Date - 2022-10-05T08:32:44+05:30 IST

నాడు చీఫ్‌ విప్‌.. నేడు విప్‌..!

నాడు చీఫ్‌ విప్‌.. నేడు విప్‌..!

శ్రీకాంత్‌రెడ్డికి డిమోషన్‌

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి డిమోషన్‌ దక్కింది! గతంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు.. ఇప్పుడు ప్రభుత్వ విప్‌ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు పొలిటిక ల్‌ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు మంగళవారం ఉత్తర్వు జారీచేశారు. ఈ అనూహ్య పరిణామం వైసీపీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో శ్రీకాంత్‌రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ, జగన్‌.. గడికోటను చీఫ్‌విప్‌ పదవికే పరిమితం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనూ గడికోటకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ.. మరోసారి నిరాశే ఎదురైంది. పైగా శ్రీకాంత్‌రెడ్డిని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో ముదునూరి ప్రసాదరాజును నియమించారు. గడికోటకు మంత్రి పదవి దక్కకపోగా.. ఉన్న ప్రభుత్వ చీఫ్‌విప్‌ పదవి కూడా కోల్పోవడం వైసీపీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.  


Updated Date - 2022-10-05T08:32:44+05:30 IST