AP News: కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్‌

ABN , First Publish Date - 2022-08-22T00:40:55+05:30 IST

నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫోన్‌ చేశారు.

AP News: కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్‌

అమరావతి: నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫోన్‌ చేశారు. కావలిలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబానికి ఫోన్‌లో పరామర్శించారు. కరుణాకర్‌ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కావలిలోని ముసునూరు హరిజనపాళెంలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల (YCP Leaders) వేధింపులు భరించలేక ఆత్మహత్య  చేసుకున్నట్లు కరుణాకరన్ సూసైడ్ లెటర్ రాశాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్రెడ్డి (Ketireddy jagadish reddy), సురేశ్రెడ్డి (Suresh reddy)లే కారణమని లేఖలో వెల్లడించాడు. రూ.20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే మూడేళ్లుగా పట్టనివ్వడం లేదని కరుణాకర్ ఆరోపించాడు. తాను, తన తల్లి వెళ్లి వైసీపీ నేతల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని యువకుడు సూసైడ్ లేఖలో ఆవేదన చెందాడు. 

Updated Date - 2022-08-22T00:40:55+05:30 IST