Chandrababu: కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2022-10-02T22:10:19+05:30 IST

వస్తున్నా.. మీకోసం' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు నేటికి పదేళ్లయింది.

Chandrababu: కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న చంద్రబాబు

అమరావతి: 'వస్తున్నా.. మీకోసం' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు నేటికి పదేళ్లయింది. ఈ సందర్భంగా చంద్రబాబును టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిశారు. పాదయాత్ర 10 ఏళ్లు పూర్తయినందున చంద్రబాబు కేక్ (cake) కట్ చేశారు. సరిగ్గా 2012 అక్టోబర్ (October) 2న హిందూపురం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. 2012 అక్టోబర్ 2న ప్రారంభమై పాదయాత్ర.. 208 రోజులు సాగింది. 63 ఏళ్ల వయసులో 2,817 కిలోమీటర్లు చంద్రబాబు నడిచారు.


ప్రజలు ఇవ్వడం కోసం 'వస్తున్నా.. మీకోసం' పేరుతో చంద్రబాబు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర పదేళ్ళ క్రితం ఇదే రోజున విశాఖలో ముగిసింది. సుమారు 7 నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ 62 ఏళ్ళ వయసులో 2,817 కిలోమీటర్లు చంద్రబాబు నడిచారు. నాటి పాదయాత్రలో ఆయన స్వయంగా ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. 208 రోజులు 16 జిల్లాల్లో 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర సాగింది. చంద్రబాబు పాదయాత్ర 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద ముగిసింది. పాదయాత్ర ముగింపు రోజున అనంతపురానికి చెందిన టీడీపీ నేత వసంతనాయుడు ఈ యాత్రకు గుర్తుగా 2 కిలో వెండితో చేసిన పాదరక్షలను చంద్రబాబుకు బహూకరించారు. 


ఈ పాదయాత్రలో 1253 గ్రామాలు, 162 మండలాలను 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలను కలుసుకున్నారు. మరొక 5 మునిసిపల్ కార్పొరేషన్ల గుండా యాత్ర సాగింది. రాష్ట్రంలో సుధీర్ఘ రాజకీయ పాదయాత్రగా చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే 2003లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. రాజశేఖర్ రెడ్డి రంగారెడ్డి చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర 1500 కిలోమీటర్లు సాగింది.



Updated Date - 2022-10-02T22:10:19+05:30 IST