విజయరాయికి చేరుకున్న చంద్రబాబు
ABN , First Publish Date - 2022-11-30T14:19:01+05:30 IST
దెందులూరు నియోజకవర్గం విజయరాయికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు.
Eluru : దెందులూరు నియోజకవర్గం విజయరాయికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు బహిరంగ సభ జరగనుంది. కలపర్రు టోల్ ప్లాజా నుంచి విజయరాయి వరకూ భారీ రోడ్ షో జరిగింది. చంద్రబాబు కాన్వాయ్ చుట్టూ వేలాది మంది యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సుమారు 40 కిలోమీటర్ల మేర చంద్రబాబుకు జనం నిరాజనాలు పలికారు. చంద్రబాబు కాన్వాయ్పై మహిళలు పూల వర్షం కురిపించారు.