నోటిఫైడ్ డిసీజ్గా కేన్సర్
ABN , First Publish Date - 2022-05-18T09:08:39+05:30 IST
న్సర్ పట్ల నిర్లక్ష్యాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాన్ కమ్యూనిబుల్ డిసీజ్ కింద ‘‘కేన్సర్ను నోటిఫైడ్ డిసీజ్’’గా గుర్తించింది.
ఇకపై ప్రభుత్వానికి కేన్సర్ రోగుల వివరాలు
అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): కేన్సర్ పట్ల నిర్లక్ష్యాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాన్ కమ్యూనిబుల్ డిసీజ్ కింద ‘‘కేన్సర్ను నోటిఫైడ్ డిసీజ్’’గా గుర్తించింది. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి కేన్సర్ బాధితుల వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు వారికి ఎలాంటి వైద్య సేవలందిస్తున్నారు, కేన్సర్ను గుర్తించడానికి ఏయే పరీక్షలు నిర్వహించారు వివరాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య సంస్థలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వుల్లో ఆదేశించారు.