పోలవరం పూర్తి చేయగలరా? ధూళిపాళ్ల
ABN , First Publish Date - 2022-09-08T08:50:37+05:30 IST
పోలవరం పూర్తి చేయగలరా? ధూళిపాళ్ల
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): జగన్రెడ్డి అసమర్థపాలన, అసంబద్ధ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. ‘‘ప్రాజెక్టులకు కనీసం ఒక్క గేటు పెట్టలేని ముఖ్యమంత్రి, మంత్రులు పోలవరాన్ని ఏం పూర్తి చేస్తారు? గతంలో జగన్రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కు శాపంగా మారాయి’’ అని విమర్శించారు.