మళ్లీ ఢిల్లీకి బుగ్గన!

ABN , First Publish Date - 2022-09-25T09:31:29+05:30 IST

పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరేందుకు సోమ, మంగళవారాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన

మళ్లీ ఢిల్లీకి బుగ్గన!

పోలవరం నిధులపై కేంద్ర ఆర్థికమంత్రితో భేటీ 


అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరేందుకు సోమ, మంగళవారాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అవుతారు. గతనెల 25న కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రధాని కార్యాలయం నియమించిన కమిటీ రాష్ట్ర విభజన సమస్యలపై సమీక్షించింది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుపైనా ప్రత్యేకంగా సమీక్షను నిర్వహించింది.


ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు ఆమోదం తెలపాలని ఆ సమావేశంలో రాష్ట్రం కోరింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీర్మానించిన రూ.20,398.61 కోట్ల అంచనా వ్యయమైనా పనులవారీగా కాకుండా ఒకే పద్దు కింద తీసుకుని తాము చేసిన పనులకు సంబంధించిన మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ చేయాలని అడిగేందుకు జగన్‌ సర్కారు సిద్ధమైంది. దీనిపై కేంద్రాన్ని అభ్యర్థించేందుకు బుగ్గన ఢిల్లీకి వెళ్లనున్నారు. 

Updated Date - 2022-09-25T09:31:29+05:30 IST