BJP Leader: అప్పుడు మూడు రాజధానుల జ్ఞానం ఏమైంది?
ABN , First Publish Date - 2022-09-17T19:54:34+05:30 IST
జగన్ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి: జగన్ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధానికి అసెంబ్లీలో మద్దతు ప్రకటించినప్పుడు.. మూడు రాజధానుల జ్ఞానం ఏమైందని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య విభేదాలు పెంచడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మించుకోలేని అసమర్థ సీఎంగా జగన్ (YS Jagan mohan reddy) నిలిచారని సత్యకుమార్ (BJP Leader) వ్యాఖ్యలు చేశారు.