Lanka dinakar: బొత్స ఏ వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నారు
ABN , First Publish Date - 2022-09-27T15:49:54+05:30 IST
మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana)పై బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఏపీ రాజధాని ఏదీ అంటే రేపు చెబుతానన్న జ్ఞానం ఉన్న బొత్స ఏ వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నారు’’ అని ప్రశ్నించారు. అయిదు నిమిషాల్లో అమరావతి రైతుల పాదయాత్ర ఆపగలం అనడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అని స్పష్టం చేశారు. పనిలేక షూటింగ్లలో బిజీ ఆర్టిస్ట్ అయిన మంత్రి యాక్షన్, కట్ అంటున్న జగన్(Jagan mohan reddy) డైరక్షన్లో నటిస్తున్నట్టుందని యెద్దేవా చేశారు. ఇక మూడు రాజధానుల ఉద్యమం ఉధృతమంటే లేని ఉద్యమాన్ని రెచ్చగొట్టడమే అని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు ఏకతాటిపైన జగన్మోహన్రెడ్డి (AP CM) దెబ్బకు ప్రజల నడ్డి విరిగింది అంటున్నారని తెలిపారు. అమరావతి రైతులపైన దాడుల కోసం రెచ్చగొడుతున్న వారిని నియంత్రించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వనిదే అని లంకా దినకర్ (BJP Leader) అన్నారు.