వివేకా హత్య జరిగినప్పుడే చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సింది: బాలినేని

ABN , First Publish Date - 2022-02-19T18:17:03+05:30 IST

వివేకా హత్య కేసు దర్యాప్తులో.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో జరిగిన హత్యతో..

వివేకా హత్య జరిగినప్పుడే చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సింది: బాలినేని

ప్రకాశం: వివేకా హత్య కేసు దర్యాప్తులో.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో జరిగిన హత్యతో.. ఎవరికి సంబంధం ఉంటుందో అర్ధం చేసుకోవాలన్నారు. హత్య జరిగినప్పుడే అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సిందన్నారు. హత్యతో టీడీపీవారికి సంబంధం ఉంటుందని భయపడే.. చంద్రబాబు సీబీఐతో దర్యాప్తు చేయించలేదని బాలినేని ఆరోపించారు. డీజీపీపై వ్యతిరేకత ఉంటే ఏపీపీఎస్సీ చైర్మన్ అవకాశం ఇవ్వబోమన్నారు. నిన్నటి వరకూ డీజీపీని తిట్టిన నోటితోనే ఇప్పుడు.. ఆయన బదిలీపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని బాలినేని విమర్శించారు.


Updated Date - 2022-02-19T18:17:03+05:30 IST