Ayyannapatrudu : ఆ రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-06T12:54:51+05:30 IST

ఐదుగురు రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని.. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

Ayyannapatrudu : ఆ రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు

Ayyannapatrudu : ఐదుగురు రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని.. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇసుక, మైనింగ్‌ ఇలా దేనినీ వదలడం లేదన్నారు. మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని అయ్యన్న విమర్శించారు. బీసీ కులాలకు జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. రోడ్లపై పరదాలు లేకుండా బయటకు వెళ్లలేని జగన్‌ ఎలా గెలుస్తారని విమర్శించారు. ఇంకా అయ్యన్న మాట్లాడుతూ.. ‘‘జగన్‌ రాసిపెట్టుకో.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీ రాజకీయ సమాధి కడతారు. జగన్‌ను సీఎం చేసి పశ్చాత్తాపపడుతున్న ప్రజలు.. వచ్చే ఎన్నికల్లో ఆ తప్పు సరిదిద్దుకోవాలి. చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు పూర్వ వైభవం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-06T12:54:53+05:30 IST