టీడీపీ నేతలపై గూండాయిజం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-04-05T23:07:23+05:30 IST
టీడీపీ నేతలపై గూండాయిజం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
అమరావతి: నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గృహనిర్భంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అననారు. అన్నమయ్య జిల్లా సదుం మండలం బూరగమందలో టీడీపీ కార్యకర్త రాజారెడ్డిపై వైసీపీ గూండాల దాడిని ప్రశ్నించిన టీడీపీ నేత నల్లారి కిషోర్ని గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ అవినీతిని ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని జగన్రెడ్డి టీడీపీ నేతలపై గూండాయిజం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.