నీరు-చెట్టుకు రూ.482 కోట్ల ‘పెండింగ్’ చెల్లింపు
ABN , First Publish Date - 2022-03-23T08:23:02+05:30 IST
నీరు-చెట్టు కార్యక్రమానికి సంబంధించి 2019కి ముందు రూ.1,707.41 కోట్లు పెండింగులో ఉన్నాయని ..
అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు కార్యక్రమానికి సంబంధించి 2019కి ముందు రూ.1,707.41 కోట్లు పెండింగులో ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ తెలిపారు. ఈ బిల్లుల్లో ఇప్పటి వరకు రూ.482.13 కోట్లు చెల్లించామన్నారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.