రేపటి నుంచి ఏపీ హైకోర్టు ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2022-01-23T08:32:42+05:30 IST
రేపటి నుంచి ఏపీ హైకోర్టు ఉద్యోగుల నిరసన
పీఆర్సీకి నిరసగా ఈ నెల 24 నుంచి నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరు కావాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి నిరసన హైకోర్టు చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదని పేర్కొంది. రిజిస్ట్రార్ జనరల్ ద్వారా ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది.