విశాఖ.. మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
ABN , First Publish Date - 2022-12-06T18:05:53+05:30 IST
నగరంలోని మధురవాడలో మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహిళను హత్య చేసి వాటర్ డ్రమ్ములో డెడ్బాడీని దాచిన ఘటనలో నిందితుడు రిషిని శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖ: నగరంలోని మధురవాడలో మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహిళను హత్య చేసి వాటర్ డ్రమ్ములో డెడ్బాడీని దాచిన ఘటనలో నిందితుడు రిషిని శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను చున్నీతో ఉరివేసి చంపినట్టు గుర్తించినట్లు సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. 2021 మేలోనే నిందితుడు మహిళను హత్యచేశాడని సీపీ పేర్కొన్నారు. మృతురాలిని ధనలక్ష్మిగా భావిస్తున్నామన్నారు. నిందితుడు రిషి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు జరపుతున్నట్లు సీపీ శ్రీకాంత్ తెలిపారు.