‘గోరంట్ల గలీజు వ్యవహారంపై వారు స్పందించారు... జగన్ స్పందించలేదు’
ABN , First Publish Date - 2022-08-17T22:44:12+05:30 IST
‘గోరంట్ల గలీజు వ్యవహారంపై వారు స్పందించారు... జగన్ స్పందించలేదు’
అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్లో వెల్లడైందని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. కానీ మాధవ్పై సీఎం జగన్రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయన ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ దిగజారి వ్యవహరించి రాష్ట్ర పరువును మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల గలీజు వ్యవహారంపై నేషనల్ ఉమెన్ కమిషన్, పంజాబ్ ఎంపీ స్పందించారు.. కానీ జగన్రెడ్డి మాత్రం ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.