శ్రీకాళహస్తిలో తెలుగు మహిళల ఆందోళన
ABN , First Publish Date - 2022-08-06T23:11:10+05:30 IST
శ్రీకాళహస్తిలో తెలుగు మహిళల ఆందోళన
తిరుపతి: శ్రీకాళహస్తిలో తెలుగు మహిళల ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల బూతుపురాణానికి నిరసనగా ధర్నా చేపట్టారు. జగన్రెడ్డి, విజయసాయి, అంబటి, గోరంట్ల మాధవ్, అవంతి దిష్టిబొమ్మల దగ్ధానికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట నడుమ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధమయింది. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, పీఎస్కు తరలించారు.