AP News: శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసన
ABN , First Publish Date - 2022-09-20T17:16:15+05:30 IST
Amaravathi: శాసన సభలో తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరగకపోవడంపై వారు అభ్యంతరం తెలిపారు.స్పీకర్ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలంటూ
Amaravathi: శాసన సభలో తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరగకపోవడంపై వారు అభ్యంతరం తెలిపారు.స్పీకర్ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమైన అంశాలను, ప్రశ్నలను ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మద్యం ,లేపాక్షి భూములు లాంటి అంశాలపై సభలో చర్చ జరగకపోవడంపై స్పీకర్ ఛాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.