AP News: వాస్తవాలపై ప్రజెంటేషన్లు ఇప్పించాలి: టీడీపీ
ABN , First Publish Date - 2022-09-20T17:51:11+05:30 IST
AP News: Presentations should be made on facts: TDP
Amaravathi: వివిధ అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని టీడీపీ నాయకులు (TDP leaders) ఆరోపించారు. దీంతో వారు ప్రభుత్వం అందించే తప్పుడు సమాచారానికి కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారమేంటీ..? వాస్తవాలేంటీ అనే అంశంపై నేతలతో ప్రజెంటేషన్లు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఆర్థిక శాఖ వ్యవహరాలపై సీఎం జగన్ (CM Jagan) ఇచ్చిన సమాచారానికి టీడీపీ నాయకులు కౌంటర్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంలో డేటా చౌర్యం జరిగిందనే ఆరోపణలపై సభా సంఘం నివేదికను భూమన కరుణాకర్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. నివేదికను సభలో పెట్టకుండా చర్చ పెట్టడమేంటంటూ టీడీపీ సభ్యుల మండిపడ్డారు. దీంతో నివేదిక కాపీలను టీడీపీ సభ్యులకు అందచేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni seetaram) ఆదేశించారు.