మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు చంచల్గూడ జైలు నుంచి విడుదల
ABN , First Publish Date - 2022-09-18T01:36:33+05:30 IST
మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు చంచల్గూడ జైలు నుంచి విడుదల
హైదరాబాద్: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసిన కేసులో నాంపల్లి కోర్టు ఐదేళ్లు శిక్ష ఖరారు చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాలు నిలిపివేస్తూ... హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 52 కోట్ల రూపాయల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించని నేపథ్యంలో గీత దంపతులపై సీబీఐ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు.. గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. గీత భర్త పి.రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష ఫైన్ వేసింది. ఈ స్కామ్కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం.