విశాఖపట్నం ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2022-09-18T01:06:56+05:30 IST
విశాఖపట్నం ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి: ఏలూరు రైల్వేస్టేషన్ దగ్గర విశాఖపట్నం ఎక్స్ప్రెస్కు తప్పింది. స్టేషన్కు చేరుకోగానే S1 - S2 - S3 భోగీల మధ్య లింకు తప్పడంతో ఘోర ప్రమాదం తప్పినట్లైయింది. దాంతో రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. స్టేషన్లో ఆగే సమయానికి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఏలూరు స్టేషన్లో నిలిచిపోయిన రైలు షిర్డీ నుంచి విశాఖ వెళ్లింది. లింకు తెగిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.