ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ సర్కారు కర్కశత్వం
ABN , First Publish Date - 2022-09-30T09:39:06+05:30 IST
ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ సర్కారు కర్కశత్వం
కేసులు పెట్టి లోపలికి పంపిస్తోంది
తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుంది
ఐదేళ్లలో 73ు ఫిట్మెంట్ ఇచ్చిన
ఏకైక రాష్ట్రం మాదే: తెలంగాణ మంత్రి హరీశ్
సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 29: ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు నమోదు చేసి లోపలికి పంపిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. గురువారం సిద్దిపేటలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఐదేళ్లలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి రూ.7,300 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టామన్నారు. ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.