‘ఓపీఎస్ మినహా దేనికి అంగీకరించేది లేదు’
ABN , First Publish Date - 2022-12-06T17:52:28+05:30 IST
సీపీఎస్తో పాటు ఇతర పెండింగ్ అంశాలపైనా చర్చిస్తామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు అన్నారు.
హైదరాబాద్: సీపీఎస్తో పాటు ఇతర పెండింగ్ అంశాలపైనా చర్చిస్తామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు అన్నారు. అందుకే ఈ మీటింగ్కు హాజరయ్యామన్నారు. సీపీఎస్కు సంబంధించి ఓపీఎస్ మినహా దేనికి అంగీకరించేది లేదన్నారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతామన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు మెమోపైనా చర్చిస్తామన్నారు.