ప్రభుత్వ టీచర్లకు అటెండెన్స్ గండం
ABN , First Publish Date - 2022-08-15T21:56:01+05:30 IST
ప్రభుత్వ టీచర్లకు అటెండెన్స్ గండం
అమరావతి: ప్రభుత్వ టీచర్లకు అటెండెన్స్ గండం ఎదరుకానుంది. స్కూల్కు నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రేపటి నుంచి ముఖ హాజరు అమల్లోకి వస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. సిమ్స్-ఏపీ యాప్ను టీచర్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్కూల్కు వచ్చిన వెంటనే యాప్లో లాగిన్ అవ్వాలని సర్కార్ పేర్కొంది. ఉదయం 9 గంటల లోపు ఫొటో తీసి..వెంటనే అప్లోడ్ చేస్తేనే హాజరు అన్నారు. అలాగే బోధనేతర సిబ్బందికీ ఇదే విధానం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్నెట్ లేని చోట పరిస్థితి ఎలా అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. యాప్ను ఇన్స్టాల్ చేయొద్దంటూ ఫ్యాప్టో పిలుపునిచ్చింది.