మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-07-17T22:55:14+05:30 IST
మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ
కోనసీమ: మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ ఎదురైంది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో విశ్వరూప్, చిట్టిబాబు పర్యటించారు. తాగునీరు, ఆహారం ఇవ్వడం లేదని వరద బాధితులు నిలదీశారు. ఎటిగట్టు నుంచి వరద నీరు లీక్ అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. సమస్యల పరిష్కారం చూపాలని తహశీల్దార్ ఠాగూర్కు మంత్రి విశ్వరూప్ ఆదేశాలు జారీ చేశారు.