పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌

ABN , First Publish Date - 2022-02-23T18:25:16+05:30 IST

పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌

అమరావతి: పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పీఆర్‌సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగులు వేసిన పిటీషన్‌‌పై కౌంటర్‌ కూడా దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓలను పిటీషనర్‌‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 


Updated Date - 2022-02-23T18:25:16+05:30 IST