Women Fire on Cm Jagan: నమ్మి ఓట్లేస్తే ఇలా చేస్తారా?

ABN , First Publish Date - 2022-07-24T23:31:28+05:30 IST

జిల్లా పేదలను ఏపీ ప్రభుత్వం (Ap Government) అపహాస్యం చేస్తోంది. నమ్మి ఓట్లు వేసిన ప్రజల చేతే ఛీ కొట్టించుకుంటోంది....

Women Fire on Cm Jagan: నమ్మి ఓట్లేస్తే ఇలా చేస్తారా?

నెల్లూరు(Nellore): జిల్లా పేదలను ఏపీ ప్రభుత్వం (Ap Government) అపహాస్యం చేస్తోంది. నమ్మి ఓట్లు వేసిన ప్రజల చేతే ఛీ కొట్టించుకుంటోంది. వైసీపీ (Ycp) అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్న టీడీపీ (Tdp) నెల్లూరులో పేదలకు అత్యాధునిక టిడ్కో ఇళ్ల (Tidco House) నిర్మాణం చేపట్టింది. అప్పటి మంత్రి నారాయణ (Narayana) దానిని ఛాలెంజింగ్‎గా తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. షీర్ వాల్ టెక్కాలజీ (Shear Wall Technology)తో ఇళ్ల నిర్మాణం చకచకా జరిగిపోయింది. కేవలం నగరంలోనే 58 వేల ఇళ్లు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం మారకముందే సుమారు 6 వేల ఇళ్ల నిర్మాణం పూర్తైంది కూడా.


ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మిస్తామని తెలిపిన వైసీపీ సర్కార్ ఆ హామీని అటకెక్కించింది. నిర్మాణాలను ఆపి వేసింది. పూర్తి అయిన ఇళ్లను కూడా పాడు పెట్టింది. అంతేనా ఉన్న ఇళ్లను ఎంతో వేగంగా వైసీపీ రంగులను వేయించింది. అయితే ప్రైవేటు గేటెడ్ కమ్యూనిటీ (Private Gated Community)లను తలదన్నేలా ఉన్న ఇళ్లను పేదలకు ఇచ్చేందుకు ఫ్యాన్ పార్టీల నేతలకు మనసు రాలేదు. 



Updated Date - 2022-07-24T23:31:28+05:30 IST