AP Capital Farmers: పెడన నియోజకవర్గానికి చేరుకున్న రైతుల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-23T16:17:19+05:30 IST

రాజధాని రైతుల మహాపాదయాత్ర ఈరోజు పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

AP Capital Farmers: పెడన నియోజకవర్గానికి చేరుకున్న రైతుల పాదయాత్ర

విజయవాడ: రాజధాని రైతుల మహాపాదయాత్ర (Amaravati farmers) ఈరోజు పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. శుక్రవారం ఉదయం పెడన నియోజకవర్గానికి పాదయాత్ర (maha padayatra) చేరుకుంది. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు పాదయాత్రకు భారీగా తరలివచ్చారు. పూల వర్షంతో అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమరావతి మహిళలు మాట్లాడుతూ...అమరావతి ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వారికి సిగ్గుండాలని అన్నారు. ఇరవై యేళ్ల నుంచి యనభై యేళ్ల వృద్దులు వరకు పాదయాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లు అయితే ఇలా ఎండనక, వాననక నడుస్తారా అంటూ మహిళలు ప్రశ్నించారు.


‘‘భూములు ఇచ్చి బజారున పడ్డాం కాబట్టే మా ఆవేదన... మీలాగా పదవులు,  డబ్బు కోసం క్యారెక్టర్‌ను తాకట్టు పెట్టం’’ అని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ (AP Assembly)లో మహిళలను గౌరవించే ప్రభుత్వం అని జగన్ (YS Jagan mohan reddy) గొప్పలు చెబుతారని... బయటకొచ్చి అమరావతి మహిళలను బూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమంలో న్యాయం, ధర్మం ఉన్నాయి కాబట్టే ప్రజలు మద్దతు ఇస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి (AP CM) వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుని అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలని అమరావతి మహిళలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-23T16:17:19+05:30 IST