AP News: సీఎం జగన్ ప్రారంభించబోయే ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-09-25T19:57:57+05:30 IST

నంద్యాల (Nandyala): కొలిమిగుండ్ల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రామ్ కో సిమెంట్..

AP News: సీఎం జగన్ ప్రారంభించబోయే ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి

నంద్యాల (Nandyala): కొలిమిగుండ్ల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న  రామ్ కో సిమెంట్ (Ram Co Cement) కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు (Two laborers) మృతి చెందారు. ఎత్తయిన ర్యాంపులు కూలిపోవడంతో వాటికిందపడి  బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులు (సుమన్, రహీమ్) మరణించారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) చేతుల మీదుగా రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పరిశ్రమ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-09-25T19:57:57+05:30 IST