Supreme Court: సుప్రీంలో పిటీషన్ ఉపసంహరించుకున్న జగన్, విజయసాయి
ABN , First Publish Date - 2022-09-09T18:23:30+05:30 IST
సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ను జగన్, విజయసాయి రెడ్డిలు ఉపసంహరించుకున్నారు.
ఢిల్లీ (Delhi): ఏపీ సీఎం జగన్ (CM Jagan), ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasaireddy) సుప్రీం కోర్టు (Supreme Court)లో వేసిన పిటీషన్ (Petition)ను ఉపసంహరించుకున్నారు. సీబీఐ (CBI) నమోదు చేసిన కేసులపై విచారణ ముగిసిన తర్వాతే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) నమోదు చేసిన కేసుల విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, విజయసాయిరెడ్డి వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించినందున పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు జగతి పబ్లికేషన్స్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్మను సింఘ్వి సుప్రీం కోర్టుకు తెలిపారు. కాగా భారతి సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై రెండు వారాల తర్వాత విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.