అనంతలో అభివృద్ధి ఎక్కడ : టీడీపీ
ABN , First Publish Date - 2022-12-13T23:58:38+05:30 IST
వైసీపీ పాలనలో అనంత అర్బనలో అభివృద్ధి ఎక్కడచేశారని టీఎనటీయూసీ జిల్లా అధికార ప్రతినిధి సిమెంట్ పోలన్న వైసీపీ నాయకులను ప్రశ్నించారు.
అనంతపురం అర్బన: వైసీపీ పాలనలో అనంత అర్బనలో అభివృద్ధి ఎక్కడచేశారని టీఎనటీయూసీ జిల్లా అధికార ప్రతినిధి సిమెంట్ పోలన్న వైసీపీ నాయకులను ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం అర్బనలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అభివృద్ది జరిగిందని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్పా ఇప్పుడేమీ చేయలేదన్నారు. బీసీలకు కార్పోరేషన్లకు ఒక్క పైసా అయినా నిధులు విడుదల చేశారా? అని ప్రశ్నించారు.