ఈ క్రాపింగ్ తుది జాబితా విడుదల
ABN , First Publish Date - 2022-11-24T00:28:55+05:30 IST
ఈ ఏడాది ఖరీఫ్ సీజనలో ఈ క్రాపింగ్ తుది జాబితాను ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ తర్వాత ఈ క్రాపింగ్ యాప్లో సాంకేతిక సమస్యలతో గత కొన్ని రోజులుగా తుది జాబితా తయారీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో వారం రోజుల క్రితం తుది జాబితాను తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపారు.
రేపటి నుంచి ధ్రువీకరణ పత్రాల జారీ
అనంతపురం అర్బన, నవంబరు 23: ఈ ఏడాది ఖరీఫ్ సీజనలో ఈ క్రాపింగ్ తుది జాబితాను ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ తర్వాత ఈ క్రాపింగ్ యాప్లో సాంకేతిక సమస్యలతో గత కొన్ని రోజులుగా తుది జాబితా తయారీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో వారం రోజుల క్రితం తుది జాబితాను తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపారు. జిల్లా వ్యాప్తంగా 1254651 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు ఈ క్రాపింగ్, ఈకేవైసీ పూర్తి చేశారు. ఆ మేరకు తుది జాబితాను ఆర్బీకేల వారిగా జిల్లాకు పంపారు. గత రెండు రోజుల నుంచి రైతుల సెల్ఫోన్లకు ఈ క్రాపింగ్ పూర్తయినట్లు ఎస్ఎంఎ్సలు పంపుతున్నారు. శుక్రవారం నుంచి ఆర్బీకేల్లో ప్రభుత్వం తరఫున ఈ క్రాపింగ్ నమోదు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. రైతులు తమ సెల్ఫోన్లకు వచ్చిన ఎస్ఎంఎ్సతోపాటు ఆధార్ కార్డు తీసుకొని వెళితే ధ్రువీకరణ పత్రం అందజేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అఽధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు.