మంగళగిరికి తరలిన తెలుగు మహిళలు
ABN , First Publish Date - 2022-07-19T05:13:08+05:30 IST
హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల తె లుగు మహిళలు మంగళగిరిలో జరిగే ఆత్మీ య సమీక్షకు తరలి వెళ్లారు.
రొద్దం, జూలై 18: హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల తె లుగు మహిళలు మంగళగిరిలో జరిగే ఆత్మీ య సమీక్షకు తరలి వెళ్లారు. సోమవారం క దిరి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, మడకశిర, పుట్టపర్తి, రాప్తాడు తదితర ని యోజకవర్గాల నుంచి మహిళలు తరలివెళ్లా రు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారాలోకేష్, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత, అన్ని నియోజకవర్గాల తెలు గు మహిళలు సమీక్షకు హాజరవుతారని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షురాలు సు బ్బరత్నమ్మ పేర్కొన్నారు. మంగళగిరికి తర లి వెళ్లినవారిలో హిందూపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, బేబి, తు లసి, అనసూయమ్మ, సుజాతమ్మ, లలిత, అనురాధ, సుకన్య, లక్ష్మీదేవమ్మ ఉన్నారు.